బోటు బయటకు వచ్చినా మృత దేహాల జాడ లేదు

గత నెల 15వ తారీకున తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో అనేక మంది మృతి చెందిన విషయం తెల్సిందే.బోటు లోతుకు జారిపోవడంతో పలువురు గల్లంతయ్యారు.

 Royal Vasistaboat Comesout In Krishna River-TeluguStop.com

కనీసం వారి మృత దేహాలు కూడా కనిపించకుండా పోయాయి.మృత దేహాలు కనిపించకుండా పోవడంతో చాలా మంది బోటు బయటకు తీస్తే ఆ మృత దేహాలు బయటకు వస్తాయేమో అని ఆశగా ఎదురు చూశారు.

దాదాపు నెల రోజుల పాటు బోటు బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగాయి.ఎట్టకేలకు ధర్మాడి సత్యం బృందం బోటును బయటకు తీసింది.

చేసిన పలు ప్రయత్నాలు విఫలం అవుతున్నా కూడా పట్టుదలతో ఆ టీం ప్రాణాలకు తెగించి మరీ బోటను బయటకు లారు.బోటు బయటకు లాగిన తర్వాత మూడు మృత దేహాలు కనిపించాయి.

అయితే ఆ మృత దేహాలు మరీ దారుణంగా కుళ్లి పోయాయి.అవి ఎవరి మృత దేహాలు అనే విషయాన్ని కూడా గుర్తించలేని పరిస్థితి.

ఇంకా పలు మృత దేహాలు కనిపించలేదు.కనిపించని మృత దేహాలకు సంబంధించిన బంధువులు ఇప్పటికే డెత్‌ సర్టిఫికెట్‌ను తీసుకున్నారు.

వారికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్‌గ్రేషియా మరియు ఇన్సురెన్స్‌ కంపెనీ ద్వారా 10 లక్షలు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube