ఈ మధ్యకాలంలో మోసాలు ఏ రేంజ్ లో పెరిగిపోయాయి అందరికి తెలిసిందే.ఇంకా సైబర్ క్రైమ్స్ అయితే మరి దారుణంగా పెరిగిపోయాయి.ఈ నేపథ్యంలోనే రూ.75 వేలకే రాయల్ ఎన్ఫీల్డ్ అని ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఫొటోతో సహా అతని ఫోన్ నెంబర్ 8168232398 ను ఓఎల్ఎక్స్లో పెట్టారు.
పాపం.ఆ బైక్ ఆఫర్ చుసిన నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు అది కొనుగోలు చెయ్యడానికి ఆసక్తి చూపాడు.దీంతో అక్కడ ఉన్న నెంబర్ చూసి ఆ వ్యక్తికి ఫోన్ చెయ్యగా అతను ఆర్మీలో విశాఖపట్నంలో పనిచేస్తానని చెప్పాడు.విశాఖపట్నం నుండి జమ్మూకాశ్మీర్కు బదిలీ అయింది.
అందుకే 2 లక్షల రూపాయిల వాహనాన్ని కేవలం 75 వేల అమ్ముతున్నాను అంటూ ఆ అమాయక యువకుడిని నమ్మించాడు.
మొదట 5వేల రూపాయిలు గూగుల్ పే ద్వారా పంపించి విశాఖకు వచ్చి వాహనాన్ని చూసుకోండి అని చెప్పాడు.
అయితే ఆ 5 వేలు చెల్లించిన గంటకే ఫోన్ చేసి.ఆ వాహనం ధర 89 వేలు రూపాయిలు అని.ఆ డబ్బు ఇస్తే బండి తీసుకెళ్ళచ్చు అని.లేదంటే లేదు అని చెప్పాడు.దీంతో ఏమి చేసేది లేక వెంకటేశ్వరా రావు గూగుల్ పే లో మిగితా డబ్బుని కూడా పంపించేశాడు.
అయితే వాహనాన్ని ట్రాన్స్పోర్ట్లో పంపిస్తానని చెప్పాడు.కానీ వారం అయినా సరే వాహనం రాలేదు.దీంతో ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే స్విచ్ అఫ్ ఇంకా ఏమి చేసేది లేక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు వెంకటేశ్వరరావు.
ఈ ఘటన తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.అందుకే ఆన్లైన్ మాటలను నమ్మి మోసపోకండి.