బైక్ ప్రియులకు శుభవార్త.మీకు ఎంతో ప్రియమైన, ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై కంపెనీ కొత్తగా ఆఫర్ను తీసుకొచ్చింది.మరింత మంది వినియోగదారులకు చేరువ కావడమే ధ్యేయంగా ఖరీదు ఎక్కువ అయినటువంటి బుల్లెట్ బైక్ను రూ.10,849 డౌన్పేమెంట్ చెల్లించడం ద్వారా సొంతం చేసుకొనే వెసులుబాటు ఈ కంపెనీ కలిగించింది.అవును, తాజాగా ఎంతో మంది కలల బైక్ అయిన బుల్లెట్ను అతి తక్కువ డౌన్పేమెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ చెబుతూ… వినియోగదారుల కళలను నిజం చేస్తోంది.
ఇకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం.రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఆన్-రోడ్ ధర రూ.2.16 లక్షలకు పైగా ఉందనే విషయం మీకు తెలిసినదే.అందుకనే సగటు మధ్యతరగతివాడికి ఇది కల గానే మిగిలిపోతోంది.అయితే రూ.10,849 డౌన్ పేమెంట్తో బుల్లెట్ 350ని కొనుగోలు చేసుకొనే వెసులుబాటు కలిగిస్తోంది.దీనికోసం మీరు నెలకు రూ.7,357 EMI చెల్లిస్తే సరిపోతుంది.ఆ తర్వాత మూడేళ్ల పాటు (36 నెలలు) ప్రతి నెల రూ.7,357 ఈఎంఐ రూపంలో చెల్లించాలి.
కంపెనీ ఫైనాన్సింగ్ సౌకర్యం కూడా కల్పించడం విశేషం.కంపెనీ 3 సంవత్సరాలకు రూ.2,06,124 లోన్ ఇస్తుంది.దీనిపై వడ్డీ ఏడాదికి 9.5 శాతం వసూలు చేస్తుంది.దీంతో 3 సంవత్సరాలలో రూ.58,728 వడ్డీతో కలిపి మొత్తం రూ.2,75,701 చెల్లించాల్సి ఉంటుంది.బైక్ 349 CC ఇంజిన్తో వస్తుంది.ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ను కలిగి ఉంది.కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతిఒక్కరు వినియోగించుకుంటారని కంపెనీ ఆశిస్తోంది.