టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.రోజు రోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగి పోతుంది.
విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.ఆయన ప్రతి ఒక్కరికి ఫేవరేట్ హీరోగా మారి పోతున్నాడు.
ఈయన త్వరలోనే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అయితే అంత కంటే ముందు ఈయన సోషల్ మీడియాలో మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తూ పోతున్నాడు.
ఈయన ఫాలోయింగ్ పాన్ ఇండియా రేంజ్ కు పెరిగింది.తాజాగా సోషల్ మీడియాలో విజయ్ మరొక మైల్ స్టోన్ చేరుకున్నాడు.
ఈయన 15 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు.దీంతో రౌడీ స్టార్ టీమ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసారు.
’15M రౌడీస్ ఆన్ ఇన్స్టా’ అంటూ పోస్ట్ షేర్ చేయగా రౌడీ స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు విజయ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత స్థానంలో నిలిచాడు.
అల్లు అర్జున్ 18 మిలియన్ ఫాలోవర్స్ తో ఉంటే.విజయ్ 15 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు.మరి ఈ స్పీడ్ చుస్తే ఆగేలా లేదు.ఇక విజయ్ ప్రెసెంట్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు.
మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు విజయ్ ఇంకా పూరీ.ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ మరింత స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.లైగర్ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 25న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు.ఈ సినిమా కోసం గత రెండు ఏళ్లగా కష్టపడుతున్నాడు విజయ్.ఈ సినిమా తర్వాత కూడా విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కే జనగణమన సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.