బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.అతని ఇమేజ్ నార్త్ కూడా విస్తరించడంతో అతని సినిమా మార్కెట్ పరిధి కూడా బాగా విస్తరించింది.
దీంతో అతని సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు.హిందీ దర్శక, నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఒకప్పుడు ఇండియన్ సినిమా ఆంటే హిందీ సినిమాలు మాత్రమే వినిపించేవి.అయితే ఇండియన్ సినిమా అంటే తెలుగులో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలు కనిపిస్తున్నాయి.
హిందీలో స్టార్ హీరోలైన ఖాన్ లు సైతం పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సాహసించడం లేదు.కానీ మన తెలుగు హీరోలు మాత్రం పాన్ ఇండియా కథలపైనే ఆసక్తి చూపిస్తున్నారు.
తమ రేంజ్ పెంచుకునే పనిలో ఉన్నారు.ప్రస్తుతం ప్రభాస్ ఇమేజ్ కి బాలీవుడ్ లో చాలా మంది హీరోలు దూరంగా ఉన్నారు.
సాహో సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసి ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నా 400 కోట్లు వరకు కలెక్షన్ చేయగలిగిన కెపాసిటీ ప్రభాస్ ది.ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న రాధేశ్యామ్ తరువాత చేయబోయే రెండు భారీ బడ్జెట్ సినిమాలు కూడా పాన్ ఇండియా కథలే.
ఇదిలా ఉంటే టాలీవుడ్ నుంచి ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్న హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో రిలీజ్ అయినా కూడా ఆ సినిమా ప్రభావం దేశ వ్యాప్తంగా ఉంది.
ప్రెజెంట్ ట్రెండ్ లో యూత్ ఐకాన్ గా ఉన్న విజయ్ దేవరకొండపై బాలీవుడ్ ఫోకస్ కూడా పడింది.నార్త్ ఇండియా నేటివిటీకి కూడా అతను సింక్ అవుతాడని అక్కడి దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ ఏకంగా విజయ్ దేవరకొండ హీరోగా అభినందన్ వర్ధమాన్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ పూరీతో చేస్తున్న సినిమా పాన్ ఇండియా మూవీనే.
కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాడు.వీటితో పాటు దిల్ రాజు ప్రొడక్షన్ లో ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు.
తాజాగా సుకుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా పాన్ ఇండియా సినిమాని ఎనౌన్స్ చేశారు.మొత్తానికి విజయ్ దేవరకొండ కూడా తన మార్కెట్ పరిధిని తన ఇమేజ్ కి తగ్గట్లు పెంచుకుంటూ ప్రభాస్ దారిలోనే పాన్ ఇండియా హీరోగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.