తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మజ్లిస్ పట్టున్న ప్రాంతాల్లో మాత్రం వారిదే పెత్తనం.వారు ఆడిందే ఆట.
పాడిందే పాట.వారి వైపు చూసే సాహసం ఎవరు కూడా చేయరు.తెల్లారి లేస్తే జనం హితం కొరకు అనే మీడియా సంస్థలు కూడా మజ్లిస్ అఘాయిత్యాలను చూపించవు.ఇలా మజ్లిస్ పట్టున్న నియోజకవర్గాల్లో కార్వాన్ ఒకటి.ఈ నియోజకవర్గంలో తప్పచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఓ ఘటన పెను సంచలనంగా మారింది.అర్ధరాత్రి వేళ కొంత మంది వ్యవహరించిన తీరును చూసిన అనేక మంది జనం షాక్ అవుతున్నారు.ఇలా ఎవరు పడితే వారు ఎలా పడితే అలా వ్యవహరిస్తే అసలు చట్టాలు ఎందుకున్నట్లు అంటూ ప్రశ్నిస్తున్నారు.
86 వ పిల్లర్ నెంబర్ దగ్గరున్న ఒక వైన్ షాపును మరియు ఒక చికెన్ షాపును అర్ధరాత్రి వేళలో కొంత మంది రౌడీ షీటర్లు ఎటువంటి అనుమతులు లేకుండా వారి ఇష్టం వచ్చిన రీతిలో జేసీబీతో నేల మట్టం చేశారు.ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఇలా తమ షాపులను అకారణంగా కూల్చేస్తున్నారని తెలుసుకున్న షాపు యజమానులు లబోదిబో మంటూ అక్కడికి చేరుకున్నారు.
కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.వైన్ షాపును నేల మట్టం చేయడం వలన అందులో నిల్వ ఉన్న దాదాపు 37 లక్షల రూపాయల మద్యం నేలపాలయింది.
ఆ స్థల యజమాని మాట్లాడుతూ… తన స్థలాన్ని ఆక్రమించుకోవడం కోసం కొంత మంది బడాబాబుల మద్దుతో ఇలా దాడులకు తెగ బడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇలా అర్ధరాత్రి వేళలో జేసీబీలను తీసుకొచ్చి ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా షాపుల్ని నేల మట్టం చేయడం దారుణమన్నారు.