మానవబంధాలు అన్నీ డబ్బుతో ముడిపడి ముందుకు సాగుతున్నాయి.నేటి సమాజంలో సాటి మనిషికి గానీ, అయిన వారికి గానీ, చివరికి కన్న తల్లిదండ్రుల పట్ల కౄరంగా ప్రవర్తిస్తున్న వారు కూడా ఉన్నారు.
ఇకపోతే ఆస్తుల కోసం అన్నదమ్ములను, కట్టుకున్న వారిని సైతం దారుణంగా చంపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.ఇలాంటి సంఘటనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఆ వివరాలు చూస్తే.
శివరాంపల్లి శ్రీదేవి కాలనీలో మహమ్మద్ జుబేర్ ఉద్దీన్, మహమ్మద్ జాఫర్ కుటుంబానికి చెందిన ఆరు వందల గజాల స్థలం విషయంలో తలెత్తిన వివాదం వల్ల అన్నదమ్ముల మధ్య పగలు ఏర్పడ్డాయట.
ఈ క్రమంలో పెద్ద కుమారుడు అయిన మహమ్మద్ జుబేర్ ఉద్దీన్ తనకు ఎక్కువ స్థలం కావాలని తన తమ్ముడు జాఫర్ అహ్మద్తో గత కొన్ని రోజులుగా గొడవ పడుతున్నాడు.
ఈ నేపధ్యంలో సాయంత్రం నమాజ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న జాఫర్ అహ్మద్పై, మహమ్మద్ జుబేర్ ఉద్దీన్ దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడట.
అంతే కాకుండా ఈ దాదిలో మరో నలుగురికి కూడా గాయాలయ్యాయని సమాచారం.
ఇకపోతే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారట.
అయితే ఇదివరకే మహమ్మద్ జుబేర్ ఉద్దీన్పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కేసు ఉందట.