ప్రస్తుత యువత ఎలా ఉందంటే వారికి ఏదైనా నచ్చినది దొరకకపోతే ఎంతటి దారుణాలకైనా పాల్పడానికి సిద్ధం అవుతున్నారు.ఈ క్రమంలో వివిధ దారుణాలకు పాల్పడి చివరకు కటకటాల పాలు అయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు.
అచ్చం అలాగే తమిళనాడు రాష్ట్రంలోని ఒక ముగ్గురు వ్యక్తులకు హోటల్ వారు బిర్యానీ పెట్టలేదన్న కోపంతో ఆ హోటల్ పై దాడికి పాల్పడ్డారు.
ఇక అసలు విషయం లోకి వెళ్తే.
ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూర్ జిల్లా తిరుమళిసైలో జరిగింది.ఓ రౌడీ అనుచరుడు హోటల్ లో బిర్యానీ పెట్టలేదని హోటల్ పై ఏకంగా బాంబులు వేశారు.
అరుణాచల పాండ్యన్, మహారాజన్, గణేషన్ ముగ్గురు వ్యక్తులు కలిసి స్థానికంగా కస్తూరి భవన్ అనే పేరుతో హోటల్ నడుపుతున్నారు.వారి హోటల్ కు ఒక రౌడీ షీటర్ వచ్చిహోటల్ లో బిర్యాని ఉందా అని అడిగగా హోటల్ యజమాని ఉందని చెప్పారు.
అయితే.రౌడీషీటర్ ఏబిన్ పేరు చెప్పి ఉచితముగా బిర్యానీ పెట్టాలని హోటల్ వాళ్లను బెదిరించాడు.
రౌడీ షీటర్ బెదిరించిన కూడా హోటల్ వాళ్ళు మేము ఉచితముగా పెట్టం అని నిరాకరించారు.దీంతో హోటల్ దగ్గరే ఆగ్రహము చెందిన రౌడీ షీటర్ ఏబిన్ అడుగుతే బిర్యాని పెట్టమంటారా.
మీ సంగతి తేలుస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అలా వెళ్లిన అతను ఒక అర్ధ గంట సేపు అయిన తరువాత నాలుగు బైకులపై ఎనిమిది మంది రౌడీ షీటర్లు వచ్చి హోటల్ పై పెట్రోల్ బాంబు వేశారు.
హోటల్ నిర్వాహకులు భయపడి ఎందుకైనా మంచిదని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించారు.కానీ బాంబుదాడిలో ఎవరికీ ప్రాణ నష్టము కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు.
పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.