దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జీషీట్ ను పరిగణనలోకి తీసుకోవడంపై విచారణ వాయిదా పడింది.
ఈ క్రమంలో విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.కాగా మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.