నేడు కాకినాడలో వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
ఏపీలో మూడు రాజధానులకు మద్ధతు తెలుపుతూ వికేంద్రీకరణపై ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఉండేందుకే మూడు రాజధానుల విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రులు చెబుతున్నారు.
అంతేకానీ అమరావతికి వ్యతిరేకం కాదని ఇప్పటికే తేల్చి చెప్పారు.ఈ క్రమంలో పాలన వికేంద్రీకరణను ప్రజలకు వివరించే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.