గతంలో కేటీఆర్ పై రోశయ్య కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

ప్రస్తుత రాజకీయాలు చాలా ఖరీదుగా మారిపోయాయి అనే ప్రచారం దేశ వ్యాప్తంగా ఉన్నా అందులో కొంత వరకు వాస్తవం అనేది ఉన్న పరిస్థితి .రాజకీయాలలో ఎంతగా ఖరీదైన విధానం ఉన్నా నాయకుడిగా విజయం సాధించాలంటే ప్రజల మన్ననలు పొందక తప్పదు.

 Rosaiah Sensational Comments On Ktr, Ktr, Rosaiah,rosaiah Death, Ktr Emotional O-TeluguStop.com

అయితే నాయకుడిగా తమకున్న ప్రత్యేకతలే మిగతా నాయకులలో మనల్ని వేరు చేస్తాయి.ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల మాజీ సీఎం రోశయ్య మరణించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సందర్భంగా చాలా మంది నాయకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు రోశయ్యతో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్న పరిస్థితి ఉంది.ఒక ప్రత్యేకత కలిగిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన రోశయ్య గతంలో ఒక సందర్భంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

ఒక జర్నలిస్టుతో కేటీఆర్ గొప్ప నాయకుడని, అణకువ ఉండడమే కాకుండా ఎంతో మర్యాదస్తుడని గొప్ప గొప్ప ఇంటర్నేషనల్ కంపెనీలను హైదరాబాద్ కు తీసుకొచ్చారని మీకు పరిచయముంటే నా వ్యాఖ్యలను ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ కు తెలియజేయాలని ఓ జర్నలిస్టుకు తెలిపారట.అయితే రోశయ్య మరణించిన సందర్భంలో అందరూ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న సందర్భంగా టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే రోశయ్య కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.ఎందుకంటే ఇప్పటి రాజకీయాలలో ఇలా పార్టీలకతీతంగా అభినందించే లక్షణాలు ఉన్న రాజకీయ నాయకులు అసలు లేరనే చెప్పాలి.

అచ్చం ఇలాంటి లక్షణాలే మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను రాజకీయాలలో తనకంటూ ఒక పేజీని ఏర్పరుచుకునేలా చేశాయని చెప్పవచ్చు.అంతేకాక అత్యంత రాజకీయ అనుభవజ్ఞుడైన రోశయ్య నేటి తరం నాయకులను అభినందించడమంటే గొప్ప విషయమనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube