ర్యాంకుల్లో కోహ్లీని వెనక్కు నెట్టిన రూట్

ర్యాంకుల్లో కోహ్లీని వెనక్కు నెట్టిన రూట్ అంతర్జాతీయ  క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా టెస్ట్ బ్యాంకు బుధవారం ప్రకటించింది.

భారత్ ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా జరిగిన టెస్టులో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా కొత్త పాయింట్లు పట్టిక ని విడుదల చేసింది.

లార్డ్ టెస్టులో సెంచరీ (129) పరుగులు కొట్టిన కె.ఎల్.రాహుల్ 599 పాయింట్లు ఏకంగా 19 స్థానాలు మెరుగుపరుచుకుని 37వ ర్యాంకుకు చేరుకున్నాడు.కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్ ర్యాంకుల్లో మార్పులేదు.

వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లోనే ఉన్నారు.అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ 893 పాయింట్ల విరాట్ కోహ్లీని.

దాటి  రెండో స్థానానికి దూసుకెళ్ళాడు.ఇక బ్యాట్స్ మెన్ విభాగంలో అగ్రస్థానంలో న్యూజిలాండ్ సారథి కెన్ విలియమ్స్ 901 పాయింట్లు తో 3,4 ర్యాంకుల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేక్ ఉన్నారు.

Advertisement

బుమ్రా 754 పాయింట్లు పదో స్థానానికి పడిపోగా, మహమ్మద్ సిరాజ్ 465 పాయింట్లు తో 18 స్థానాలు ఎగబాకి 38ర్యాంకులో నిలిచాడు.ఐదు వికెట్లు ప్రదర్శన చేసిన జేమ్స్ అండర్సన్ ఆరు, మార్కువుడ్ 37 ర్యాంకులో ఉన్నాడు.

  ప్యాంట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), రవిచంద్ర అశ్విన్ ఇండియా) టీంసౌదీ (న్యూజిలాండ్), జోష్ హాజిల్వుడ్ (ఆస్ట్రేలియా), నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్) వరుసగా తొలి 5 స్థానాలు దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు