తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి.ఇక అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉంటాయి.
ఇక ఇప్పటి వరకు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ కాస్త ప్రజల్లో ప్రభావం కోల్పోవడంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ తయారయింది.అసలు గత రెండేళ్ల వరకు అసలు తెలంగాణలో బీజేపీకి బలం లేని పరిస్థితులలో బండి సంజయ్ అధ్యక్షుడైన తరువాత బీజేపీకి ఓ మాస్ లీడర్ అధ్యక్షుడు కావడంతో కార్యకర్తలలో ఉత్సాహం వచ్చింది.
ఇక అప్పటి నుండి బీజేపీ వెనక్కి తిరిగి చూసుకుకోవడం లేదు.ఒక్కసారిగా బీజేపీ దుబ్బాకలో గెలుపొందడం, గ్రేటర్ లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం ఇలా బీజేపీ కాంగ్రెస్ ను వెనక్కి నెట్టింది.
అయితే బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నాడు.అయితే ఇక ప్రతి దానికి కేసీఆర్ విమర్శిస్తుండటంతో ఇక విమర్శలను ప్రజలను లైట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది.
అయితే ఈ సారి కొత్త తరహా విమర్శలను ఎక్కుపెడుతున్నారు.కేసీఆర్ ఫామ్ హౌజ్ కు ఎమ్మెల్యేలకు దోపిడీ లు ఎలా చేయాలో శిక్షణ ఇస్తుంటారని బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేస్తూ కొత్త రూట్ ను ఎంచుకుంటున్నారు.