డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన కొడుకుని ఎలా అయినా కమర్షియల్ హీరోగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇందులో భాగంగా హోం బ్యానర్ లోనే అతనితో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే తన దర్శకత్వంలో ఆకాష్ కి పెర్ఫెక్ట్ లాంచింగ్ ఇవ్వాలని మెహబూబా సినిమా తెరకెక్కించారు.అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
దీంతో ఒక రొమాంటిక్ లవ్ స్టొరీ కొడుకు కోసం సిద్ధం చేసి దానిని తన శిష్యుడు అనిల్ చేతిలో పెట్టి దర్శకత్వ బాద్యతలు అప్పగించి తన బ్యానర్ లోనే తెరకెక్కించారు.ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ కేతిక శర్మని హీరోయిన్ గా పరిచయం చేశాడు.
ఇక ఈ భామ పూరీ కొడుకు కోసం ఎంత గ్లామర్ షో చేయాలో అంతా చేసింది.అయితే లాక్ డౌన్ కి ముందే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన ఏ రిలీజ్ వాయిదా పడిపోయింది.
అయితే లాక్ డౌన్ తర్వాత వరుస సినిమాలు రిలీజ్ అవుతున్న పూరీ మాత్రం రొమాంటిక్ రిలీజ్ ఊసే ఎత్తలేదు.అయితే సడెన్ గా ఎలాంటి సందడి లేకుండా మే 29 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేశారు.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా లైగర్ షూటింగ్ లో ఉన్నారు.అయితే ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో పాటు సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది.
ఈ నేపధ్యంలో థియేటర్ లో సినిమా రిలీజ్ చేసిన లాభం లేదని డైరెక్టర్ గా ఒటీటీ రిలీజ్ కి పూరీ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.దీనికోసం అమెజాన్ లో రొమాంటిక్ ని రిలీజ్ చేయడానికి ఇప్పటికే ఒప్పందం కూడా జరిగిపోయిందని త్వరలో రిలీజ్ డేట్ అమెజాన్ ప్రైమ్ ద్వారానే ఎనౌన్స్ చేయనున్నట్లు బోగట్టా.