ప్రముఖ నటి, వైసీపీ మంత్రి రోజా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాకు సినిమా, రాజకీయాలు రెండూ రెండు కళ్లు అని ఆమె అన్నారు.
పుట్టినరోజు అంటే ముందురోజు రాత్రి జరుపుకుంటానని ఆమె తెలిపారు.నేను ఎక్కడ ఉన్నా ప్రజల మధ్యే ఉంటున్నానని రోజా పేర్కొన్నారు.
కాలేజ్ లో ఉన్న సమయంలో నేను నాటీగా ఉండేదానినని ఆమె అన్నారు.
రైమింగ్స్ తో, టైమింగ్స్ తో మాట్లాడటం నాకు ఇష్టమని రోజా వెల్లడించారు.
రాజకీయాలు అంటే ఎంత కష్టపడినా శత్రువులు ఎక్కువగా ఉంటారని రోజా అన్నారు.రాజకీయాల్లో ఉండి ఎంత సేవ చేసినా నెగిటివ్ గా చాలామంది కామెంట్లు చేశారని ఆమె చెప్పుకొచ్చారు.
నన్ను తిట్టిన వాళ్లు అంతా శత్రువులు అని అనుకోనని ఆమె అన్నారు.చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో నేను వేరే పార్టీలో ఉండటం వల్ల విమర్శలు చేయాల్సి వచ్చిందని రోజా కామెంట్లు చేశారు.
రాజకీయాలకు చిరంజీవి సూట్ అవ్వరని నేను చెప్పగా అప్పట్లో అందరూ నవ్వారని ఆమె వెల్లడించారు.చిరంజీవి గారు ఎంత సెన్సిటివ్ అనే విషయం నాకు బాగా తెలుసని రోజా పేర్కొన్నారు.
చిరంజీవి గారిపై నేను విమర్శలు చేయడం నన్ను ఎంతగానో బాధ పెట్టిందని రోజా పేర్కొన్నారు.చిరంజీవి గారిని ఒక సందర్భంలో కలవగా నేను తిట్టినా కోపం రాలేదని చెప్పారని రోజా చెప్పుకొచ్చారు.
ఒక ఆర్టిస్ట్ గా, ఫ్యామిలీ ఫ్రెండ్ గా నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో నాకు తెలుసు అని చిరంజీవి అన్నారని రోజా పేర్కొన్నారు.రోజా ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ అవుతున్నారు.రోజా సినిమాలకు దాదాపుగా దూరమైనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రోజా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.