ఎంత మాట ఎంత మాట : బాలయ్యకు పౌరుషం లేదు ... లోకేష్ గన్నేరు పప్పు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా మరో సారి టీడీపీ నాయకులపై రెచ్చిపోయారు.ఎన్నికల ప్రచారంలో బాలయ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని…ఆయనకు ఎన్టీఆర్ పౌరషం లేదని విమర్శించారు.

 Roja Sensetional Coments On Lokesh And Balakrishna-TeluguStop.com

అంతే కాదు… నందమూరి కుటుంబాన్ని రాజకీయాల నుంచి తప్పించడానికి సుహాసినికి సీటిచ్చారు.ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగను వదిలేస్తే చంద్రబాబు ఎంతకు తెగించారో కేసీఆర్ తెలుసుకోవాలని రోజా సూచించారు.

తెలంగాణాలో ప్రచారం చేస్తున్న చంద్రబాబును సీమాంధ్ర ప్రజలు అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చారు.రెండు రాష్ట్రాలలో పనికిరాని గన్నేరు పప్పు లోకేష్ అంటూ ఆమె సంచలన విమర్శలు చేశారు.

తెలంగాణలో పార్టీ మారిన శాసనసభ్యులు చిత్తుచిత్తుగా ఓడించమని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు.అదే మాట ఆంధ్రాలో వర్తించదా.? పొత్తుల కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారని….హరికృష్ణ శవాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించారు అంటూ రోజా మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube