వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా మరో సారి టీడీపీ నాయకులపై రెచ్చిపోయారు.ఎన్నికల ప్రచారంలో బాలయ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని…ఆయనకు ఎన్టీఆర్ పౌరషం లేదని విమర్శించారు.
అంతే కాదు… నందమూరి కుటుంబాన్ని రాజకీయాల నుంచి తప్పించడానికి సుహాసినికి సీటిచ్చారు.ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగను వదిలేస్తే చంద్రబాబు ఎంతకు తెగించారో కేసీఆర్ తెలుసుకోవాలని రోజా సూచించారు.
తెలంగాణాలో ప్రచారం చేస్తున్న చంద్రబాబును సీమాంధ్ర ప్రజలు అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చారు.రెండు రాష్ట్రాలలో పనికిరాని గన్నేరు పప్పు లోకేష్ అంటూ ఆమె సంచలన విమర్శలు చేశారు.
తెలంగాణలో పార్టీ మారిన శాసనసభ్యులు చిత్తుచిత్తుగా ఓడించమని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు.అదే మాట ఆంధ్రాలో వర్తించదా.? పొత్తుల కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారని….హరికృష్ణ శవాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించారు అంటూ రోజా మండిపడ్డారు.