సంక్రాంతి పండుగ సందర్భంగా కడప జిల్లాలో బంధువులతో భోగి వేడుకలలో రోజా పాల్గొన్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ… పండుగ సాంప్రదాయాలు పిల్లలకు తెలియజేయాలంటే గ్రామాల్లో బంధువులతో ఇటువంటి పండుగలు జరుపుకోవాలని సూచించారు.
భోగి అంటే చెడు పై మంచి గెలవడం.గత ఏడాది ప్రకృతి పరంగా తుఫాన్లు ఇంకా మహమ్మారి వైరస్ కారణంగా రాష్ట్రంలో చాలా చెడు జరిగింది అటువంటి జరగకుండా భగవంతుని కోరుకున్నట్లు రోజ తెలియజేశారు.
ఇదే తరుణంలో దేశంలో బెస్ట్ సీఎం లలో చిన్న వయసులోనే సీఎం జగన్ రెండో స్థానం సాధించడం.అద్భుతమని రాష్ట్ర ప్రజలపై ఆయనకు అపారమైన ప్రేమ ఉందని పేర్కొన్నారు.
అందువల్లే ప్రకృతి వల్ల ఎంత నష్టం వస్తున్న ప్రజలను ఆదుకునే రీతిలో… పరిపాలిస్తున్నారు.ఇక ఇదే తరుణంలో నిన్న సీఎం వైఎస్ జగన్ ని చిరంజీవి కలిసిన అనంతరం.
చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఆయన హావభావాలు గమనిస్తే.అర్థమవుతుంది.
జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనుషులను అభిమానిస్తారు.వాళ్లను ఆహ్వానించి.
వాళ్ల సమస్యలను నేరుగా పరిష్కరించే రీతిలో ఏ విధంగా వ్యవహరిస్తారు.అనేదాని గురించి స్పష్టంగా చిరంజీవి గారు మీడియాతో చెప్పడం జరిగింది.
సో సీఎం జగన్ రాష్ట్ర ప్రజల మేలు కొరకు ఏదైనా చేస్తారు.అది సినిమా టికెట్లు వ్యవహారమైనా.
విద్యాసంస్థల ఫీజులు అయినా.కక్షపూరితంగా కాకుండా రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగానే చేస్తారు.
ఎవరి మీద కక్షపూరితంగా జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకోరు అంటూ రోజా క్లారిటీ ఇచ్చారు.