తెలుగు సిని సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు రోజా గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
తన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంది.స్టార్ హీరోల సరసన నటించిన రోజా ఆ మధ్య కొన్ని సినిమాలలో కీలకపాత్రల్లో నటించింది.
అంతేకాకుండా బుల్లితెరలో ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా రోజా సెల్వమణి దంపతులకు ఘనంగా సత్కారం చేశారు.
ప్రస్తుతం రోజా ఎమ్మెల్యేగా ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా తన బాధ్యతలను నిర్వహిస్తుంది.ఇక తాజాగా ఏపీ లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తన నగర నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు వైసీపీకి సొంతమయ్యాయి.
ఇతర అభ్యర్థులు పోటీ చేయగా వాళ్లతో వైసీపీ విజయం సాధించింది.దీంతో నగరి నియోజకవర్గంలో మున్సిపాలిటీలు సొంతం చేసుకొని తన మాటను నిలబెట్టుకున్నారు రోజా.ఇక ఈ సందర్భంగా మున్సిపల్ లో కౌన్సిలర్ గా ఎన్నికైన వాళ్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇక వైసీపీ నేతలు, కార్యకర్తలు రోజా సెల్వమణి దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇదివరకే వైసీపీ తరఫున రోజా పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది.
మొదటిసారి గెలిచినప్పుడు పార్టీ ఓడిపోగా రెండోసారి గెలిచినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది.వైసీపీ కంటే ముందు రోజా తెలుగుదేశం పార్టీతో రాజకీయం చేసిన సంగతి తెలిసిందే.
ఆ పార్టీలో రెండుసార్లు పోటీచేయగా ఆ పార్టీ టికెట్ పై ఓడిపోయింది.ప్రస్తుతం రోజా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయం వైపు బాగా దృష్టి పెట్టిందని అర్థమవుతుంది.