రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను కడుపుబ్బా నవ్వించే టీవీ కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అందరూ చెప్పే ఒకే సమాధానం జబర్దస్త్ షో అని.ఈ షో మల్లెమాల టీవీ యాజమాన్యం నిర్వహిస్తూ ఈ టీవీలో ప్రసారం చేస్తోంది.
ఇందులో జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మి వ్యాఖ్యాతగా చేస్తోంది.ఈ రెండు కార్యక్రమాలకి నటి, ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా, సింగర్ మనో న్యాయ నిర్ణేతలుగా పని చేస్తున్నారు.
ఇకపోతే ఈవారం ప్రసారం కాబోయే కార్యక్రమం సంబంధించి ప్రోమో ను తాజాగా విడుదల చేసింది మల్లెమాలటీవి.
ఈ ప్రోమో లో హైపర్ ఆది స్కిట్ లో భాగంగా జబర్దస్త్ స్టేజ్ పై సుడిగాలి సుధీర్ టీం సందడి చేయనుంది.
ఈ స్కిట్ నుంచి వరుస పంచ్ లతో తెలుగు ప్రేక్షకులను నవ్వించడానికి ట్రై చేశారు.ఇకపోతే మరోసారి అదిరే అభి స్కిట్ లో భాగంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ స్టేజ్ పై వరుస పంచులతో నవ్వించారు.
రాముకి, రాకేష్ పంచులు వేస్తున్న తరుణంలో జడ్జ్ గా వ్యవహరిస్తున్న రోజా కలగజేసుకుని రాకేష్ మాస్టర్.పెద్దపెద్ద వాళ్లనే పంపించేశాడు అంటూ సరదాగా కౌంటర్ వేసింది.
అలాగే ఈ ఎపిసోడ్ లో భాగంగా వెంకీ మంకీస్, చలాకి చంటి స్కిట్ లు సైతం ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.ఈ ప్రోమో సంబంధించిన ఎపిసోడ్ నవంబర్ 19 న ఈటీవీ లో ప్రసారం కానుంది.ఇదివరకు రాకేష్ మాస్టర్ జబర్దస్త్ షో పై అనేక కామెంట్ చేసిన ఆ తర్వాత ఆయన కొన్ని పరిస్థితుల వల్ల మళ్లీ తిరిగి జబర్దస్త్ స్టేజ్ పై కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.