అప్పట్లో తన అందంతో ,అభినయంతో, నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న హీరోయిన్లలో రోజా ఒకరిని చెప్పవచ్చు.ప్రస్తుతం అదే స్పీడ్ తోనే జబర్దస్త్ వంటి కామెడీ షో కి జడ్జిగా వ్యవహరిస్తూ, మరోవైపు నగరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
సినిమాల విషయం పక్కనపెడితే ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా ప్రజలకు అందుబాటులో ఉంటారు.ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తూ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్పీడ్ తో కొనసాగుతున్న ఎమ్మెల్యే రోజా ఇప్పుడు ఏకంగా కత్తెర పట్టారు.
రోజా కూతురు అన్షు మాలిక కోరిక మేరకు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసారు.ఇటు బుల్లితెర పై ఎంతో బిజీగా ఉంటూ,మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటున్న రోజా వీలు దొరికినప్పుడల్లా తన భర్త సెల్వమణి పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుంటారు.
అయితే ఇటీవల కాలంలో తన కూతురిని కోరిక మేరకు ఒక బ్యూటీ సెలూన్ ను ప్రారంభించారు.హైదరాబాద్ లోని సలీం కాటూన్ మసీద్ బిల్డింగ్లో యునిక్యూ అనే పేరుతో బ్యూటీ సెలూన్ నీ ఎంతో ఘనంగా ప్రారంభించారు.
బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలో రోజా కత్తెర పట్టుకుని కన్పించడం తోపాటు తన కూతురు కూడా ఎంతో అందంగా ఉన్నారు.ఈ ఫోటో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇంత చిన్న వయస్సులోనే ఎంతో మంది పేద విద్యార్థులకు తనకు తోచిన సహాయం చేస్తూ తల్లికి తగ్గ తనయగా అన్షు మాలిక పేరు సంపాదించుకున్నారు.
పోతే కొద్దిరోజుల్లోనే రోజా వారసురాలుగా అన్షు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుందన్న వార్తలు జోరుగా సాగుతున్నాయి.అయితే ఈ విషయంపై స్పందించిన రోజా ప్రస్తుతం తన విద్యాబ్యాసం కొనసాగుతోంది కాబట్టి ఏ మాత్రం డిస్టర్బ్ చేయకూడని ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వీరి బ్యూటీ సెలూన్ కి సంబంధించిన ఫోటోలు మాత్రం నెటిజన్లను ఆకట్టుకున్నాయి.