27 ఏళ్ల కిందట మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రోజా’.మణిరత్నం ఎంతో నేర్పుతో ఆ చిత్రాన్ని రూపొందించాడు.
ఆ చిత్రంలో హీరో, హీరోయిన్స్ గా నటించిన అరవింద స్వామి, మధుబాల లకి ప్రేక్షకులనుండి మంచి ఆధరణ లబించింది.ఆ చిత్రం తరువాత ఆ జోడి మరే సినిమాల్లో కనిపించింది లేదు.
మరోసారి ఈ జంట, కనువిందు చేయ్యబోతున్నారని సమాచారం అందుతుంది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్రను వెండి తెరరూపంలో తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.
ఏఎల్ విజయ్, దర్శకత్వంలో, బాలీవుడ్ నటి కంగనా టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తలైవి’.కంగనా జయలలిత పాత్రలో నటిస్తుంది.ఈ చిత్రంలో అరవింద స్వామి ఎంజీఆర్ పాత్రలో నటిస్తుండగా అయన భార్య జానకి పాత్రలో మధుబాల నటిస్తుందని ప్రచారం జరుగుతుంది.త్వరలోనే అధికారిక సమాచారం వేలువడనున్నది.