రాములమ్మ డైలాగ్ తో రెచ్చిపోయిన రోజా...

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా ఘాటుగా సాగుతున్నాయి.అంతేగాక ఇప్పటికే వికేంద్రీకరణ బిల్లు అంశంపై శాసనసభ మండలి రద్దు చేసేందుకు వైయస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 Roja Is Saying Sarileru Neekevvaru Dialogue In Assembly-TeluguStop.com

అయితే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ్ ఇస్తుండగా వైకాపా పార్టీ చెందినటువంటి నగరి ఎమ్మెల్యే రోజా సరిలేరు నీకెవ్వరు సినిమాలోని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి డైలాగుతో రెచ్చిపోయారు.

గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు అంటూ ప్రసంగించారు.

అయితే దీనికి వివరణ ఇస్తూ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఎన్నికల ముందు నిరంతరంగా తమ నాయకుడు అయినటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడని, ఇప్పుడు ఆ కష్టాలను తీర్చేందుకు ప్రజలకు అనుగుణమైనటు వంటి పథకాలను ప్రవేశపెడుతూ వారి కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.

Telugu Roja, Roja Latest, Vijaya Shanthi, Ysrcp, Ysrcp Latest-Latest News - Telu

అంతేకాక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు.నారా లోకేష్ ని ఉద్దేశించి దద్దమ్మ , దద్దోజనం వంటి పదాలను ఉపయోగించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.శాసన మండలిని రద్దు చేయాలన్నఅంశంతో తాను ఏకీభవిస్తున్నానని కూడా తెలిపారు.

అయితే ఇది ఇలా ఉండగా నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి రోజాపై పలువురు టీడీపీ నేతలు మండిపడుతున్నారు.దేవాలయం లాంటి అసెంబ్లీలో ఉంటూ అసభ్య పదజాలంతో ఉపయోగిస్తూ ప్రతిపక్ష నాయకులను దూషించడం సరికాదన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube