ఏపీ సీఎం చంద్రబాబు మీద నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి చెలరిగిపోయారు.జగన్ తరపున యుద్ధం ప్రకటించారు.
బాబు మీద ఆరోపణల జడివాన కురిపించారు.ఆయన్ని రాయలసీమ ద్రోహి అని తిట్టిపోశారు.
రాయలసీమ జనం టీడీపీకి ఓట్లు వేయక పోవడంతో బాబు వారిపై కక్ష సాధిస్తున్నారని అన్నారు.
రాయలసీమ ప్రజలంతా ఒక ప్రమాణం చేయాలట.ఏమని? బాబును రాయలసీమలో తిరగనివ్వబోమని ప్రమాణం చేయాలన్నారు ఈ ఫైర్ బ్రాండ్.కరువు నిధులు దోచేసి ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొన్నారట.
బాబులో రాయలసీమ రక్తం ప్రవహిస్తున్నట్లైతే, ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు పోవాలని రోజా సవాల్ విసిరారు.
జగనన్న తరపున తాను యుద్ధం ప్రకటిస్తున్నానని, ఎన్నికలకు తయారు కావాలని కాలు దువ్వారు.
పనిలో పనిగా ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమను తరిమి కొట్టాలన్నారు.మొత్తం మీద అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ రోజాలో దూకుడు తగ్గలేదు.
నోరు అదుపులో పెట్టుకోలేదు.ఆమె రాజకీయం స్టయిల్ ఇది.