ఆయన విజన్ 2020 కాదు... అదొక 420 విజన్...!

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ శీతాకాల సమావేశాల్లో మాటల యుద్ధం రోజురోజుకి ఎక్కువ అవుతోంది.ఈ సమావేశాల్లో ప్రతి పక్ష నేతలపై అధికార పక్ష నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.

 Roja Chandrababu Naidu Andhra Pradesh 2020-TeluguStop.com

అయితే ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో నగరి ఎమ్మెల్యే రోజా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. ఇందులో భాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులన్ని ఎత్తి చూపారు.

Telugu Andhra Pradesh, Andhrapradesh, Ap Assembly, Chandra Babu, Tdpmla, Ycp Mla

ఒక్క టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 75వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయ వచ్చిందంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఎంత ప్రోత్సహించిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.  రాష్ట్రంలో రామ రాజ్యం తీసుకురావడానికి తమ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలూ కష్ట పడుతున్నాడని అన్నారు.అయితే మొన్న జరిగిన సమావేశంలో చంద్రబాబు విజన్ 2020 గురించి చర్చించిన విషయం తెలిసిందే.

అయితే ఆ విషయంపై రోజా స్పందిస్తూ చంద్రబాబు గారి విజన్ విజన్ 2020 కాదని అదొక 420 విజన్ అని ఎద్దేవా  చేసారు.

అంతేగాక గ్రామాల్లో పూర్తిగా మద్యపాన నిషేధం చేసి స్వరాజ్య గ్రామాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు.

అలాగే సమాజంలో ఎప్పుడైతే ఒక ఆడపిల్ల అర్థరాత్రి సమయంలో స్వేచ్ఛగా తిరగగలుగుతుందో అప్పుడే మనకు అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లుని మహాత్ముడు చెప్పిన మాటలకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.అందుకే రాష్ట్రంలో అన్నిఅనర్ధాలకి కారణమైన మద్యాన్ని త్వరగతిన మద్యపాన నిషేధం అనే పవిత్ర యజ్ఞనాన్ని అమలు చేస్తున్నామని అన్నారు.

ఇందులో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో దాదాపు మూడు వేల వెళ్ళుతూ షాపులను మూసివేసినట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube