ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల ప్రభావం ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ పై పడిందనే విషయం తెల్సిందే.ఆ ఎన్నికల్లో పోటీ చేసిన జబర్దస్త్ జడ్జ్లు నాగబాబు మరియు రోజాలు కొన్ని రోజుల పాటు షోకు దూరంగా ఉన్నారు.
ఇటీవలే నాగబాబు మళ్లీ తాను జబర్దస్త్కు వెళ్లబోతున్నట్లుగా ప్రకటించాడు.అయితే వచ్చే ఎపిసోడ్లో రోజా అయితే కనిపించబోతున్నాడు కాని నాగబాబు మాత్రం ఇంకా వచ్చినట్లుగా లేడు
నిన్న విడుదల అయిన వచ్చే వారం ప్రమోలో జడ్జ్లుగా నాగబాబు లేకుండా కేవలం రోజా మాత్రమే ఉంది.
ఇక రోజా పక్కన మరో జడ్జ్గా మీనా ఉండటం మనం చూడవచ్చు.నాగబాబు ఎందుకు ఇంకా జబర్దస్త్లోకి ఎంట్రీ ఇవ్వలేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ముందు నుండి జరిగిన ప్రచారం ప్రకారం జబర్దస్త్కు నాగబాబు వస్తాడు కాని, రోజా రాదు, ఆమె ఏపీలో వైకాపా అధికారంలోకి వస్తే మంత్రి పదవిని దక్కించుకునే అవకాశం ఉంది.అందువల్ల ఆమె రాకపోవచ్చు అన్నారు.
కాని నాగబాబు కంటే రోజానే ముందు వచ్చింది
వీరిద్దరు ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులుగా తలబడ్డారు.కాని అనూహ్యంగా మళ్లీ జబర్దస్త్ వేదికపై కలిసి కూర్చోబోతున్నారు.
భారీ ఎత్తున వీరిద్దరి కాంబోకు క్రేజ్ ఉన్న కారణంగా మళ్లీ వీరిద్దరే కావాలని జనలు కోరుకుంటున్నారు.వచ్చే వారం కాకున్నా ఆ తర్వాత వారం అయినా నాగబాబు కూడా జబర్దస్త్ టీంకు జాయిన్ అయ్యే అవకాశం ఉందని బుల్లి తెర వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ప్రస్తుతం జబర్దస్త్ షోతో ఈటీవీ టాప్లో ఉంది.నాగబాబు, రోజా లేని ఈ నాలుగు వారాలు గందరగోళంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.
అందుకే వారిని తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి, జరుగుతున్నాయి.