సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరగబోయే ఐపీఎల్ 2020 సీజన్ కు సర్వం సిద్ధం అవుతోంది.యూఏఈ దేశంలోని దుబాయ్, అబుదాబి, షార్జా మూడు వేదికల్లో మొత్తం 53 రోజుల్లో ఏకంగా 60 మ్యాచ్లను నిర్వహించబోతోంది బీసీసీఐ.
ఇందుకోసం ఇప్పటికే ఐపీఎల్ లో పాల్గొనే అన్ని టీమ్స్ వారి క్రీడాకారులతో అక్కడకు చేరుకొని ముందుగా క్వారంటైన్ ను పూర్తి చేసుకున్నారు.ఆ తర్వాత వారికి కేటాయించిన గ్రౌండ్స్ లో ప్రాక్టీసింగ్ కూడా ముమ్మరంగా సాధన చేస్తున్నారు.
ఇకపోతే సెప్టెంబర్ 19న మొదటి మ్యాచ్ గత సీజన్ లో విన్నర్స్, రన్నర్స్ అయిన ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్యలో మ్యాచ్ జరుగుతోంది.ఇరుజట్లు ప్రాక్టీస్ పరంగా ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.
ఇక అసలు విషయంలోకి వెళ్తే…
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్ లో ఫీల్డింగ్ బ్యాటింగ్ పై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.ఇక గ్రౌండ్ లో వచ్చిన తర్వాత తన భార్య రితిక కుమార్తె సమైరా లతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇదే క్రమంలో తాజాగా గత రాత్రి తన కూతురుతో కలిసి సంతోషంగా గడిపిన క్షణాలను రోహిత్ శర్మ తన ఇంస్టాగ్రామ్ వేదికన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.తన కూతురు తో కలిసి ఓ చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేస్తూ హుషారుగా డాన్స్ చేశాడు.
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2020 సీజన్ ను పూర్తి బయో సెక్యులర్ విధానంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించబోతున్నారు.ఇందుకు సంబంధించి టీం యాజమాన్యానికి క్రీడాకారులకు బీసీసీఐ కట్టుదిట్టమైన రూల్స్ ను కేటాయించింది.
వాటిని అతిక్రమిస్తే క్రీడాకారులు కచ్చితంగా సస్పెన్షన్ వేటుకు గురి కావలసి ఉంటుంది.