న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియా విజయాలతో టూర్ ని మొదలెట్టింది.ముందుగా టీ20 సీరీస్ ప్రారంభించిన భారత్ వరుస విజయాలతో సిరీస్ సొంతం చేసుకుంది.
తాజాగా హోమిల్తాన్ వేదికగా మూడో మ్యాచ్ లో కూడా విజయం సొంతం చేసుకుంది.అయితే సూపర్ ఓవర్ తో ఈ మూడో మ్యాచ్ లో విజయం అందుకుంది.
రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో తన సత్తా చూపించడంతో టీం ఇండియా గెలుపు నల్లేరు మీద నడకే అయ్యింది.అయితే ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగడం విశేషం.
టాస్ ఒడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ (65), విరాట్ కోహ్లీ (38), కేఎల్ రాహుల్ (27) పరుగులు చేశారు.
ఒకానొక దశలో ఇండియా స్కోర్ ఈజీగా 200 దాటేస్తుంది అనుకున్న మధ్యలో న్యూజిలాండ్ బౌలర్స్ బ్యాట్స్ మెన్ లని కట్టడి చేశారు.ఆ తరువాత 179 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.
దీంతో మ్యాచ్ టై కావడం తో సూపర్ ఓవర్ ఏర్పాటు చేసారు.సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్ జట్టు 6 బంతుల్లో 18 పరుగులు చేయగా, మిండియా తరపున బ్యాటింగ్ కు దిగిన కేఎల్ రాహుల్ – రోహిత్ శర్మ 20 పరుగులు చేసి భారత్ ను విజయతీరాలకు చేర్చారు.
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సత్తా చాటి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.