ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్రీయ సాంకేతిక పరంగా అభివృద్ధిలు జరుగుతున్నాయి.పలు దేశాల్లో కూడా ఇప్పటికీ ఎన్నో రకాల రంగాలలో రోబో లను వాడుతున్న సంగతి తెలిసిందే.
దేశాలలో సాంకేతికంగా మరింత అభివృద్ధి కోసం శాస్త్రీయ నిపుణులు ఎన్నో రకాల రంగాలను అభివృద్ధి చేస్తున్నారు.కాగా ఇటీవలే రోబోలను అద్దెకు కూడా దొరికే అవకాశం ఉందని తెలిపారు.
పలు దేశాలలో రెస్టారెంట్లలో, హెల్త్ కేర్ సంస్థలలో, బ్యాంకింగ్ వంటి రంగాలలో రోబోలు ఉండగా.ఇటీవలే నూతన సంవత్సరం సందర్భంగా ఓ సంస్థ రోబోలను తయారుచేసి వాటితో కొన్ని వేడుకలు జరిపించిన విషయం తెలిసిందే.
కాగా ఇటీవలే హైదరాబాద్ కు చెందిన విస్టన్ నెక్ట్స్ జెన్ కొన్ని రంగాలలో రోబోలను అద్దెకు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
అంతే కాకుండా దేశంలో మొదటిసారిగా రోబో సర్వీసులను ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నామంటూ విస్టన్ నెక్ట్స్ జెన్ వ్యవస్థాపకుడు రామరాజు సింగం తెలిపారు.అంతేకాకుండా రోబో ప్లాంకీ కంపెనీ ను కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు.ఈ రోబోలు పలు రంగాల్లో సేవలను అందిస్తాయని తెలిపారు. 2022 వ సంవత్సరంలో ఈ కంపెనీ మరిన్ని రోబోలను తయారుచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఇప్పటివరకు రోబోలకు దాదాపు పది కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు రామరాజు తెలిపారు.
అంతేకాకుండా ఈ తరహా రోబోలను హైదరాబాద్ లో సొంత సంస్థను ప్రవేశ పెట్టడానికి కొన్ని ఆలోచనలు చేస్తున్నారట.పలు రంగాల్లోనే కాకుండా రవాణా సరఫరా కోసం విమానం నడిపేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు.
కాగా ఆ విమాన సంస్థ కు చెందిన యూరప్ తో చర్చలు జరిగాయని తెలిపారు.కాగా వచ్చే ఏడాది జూన్ వరకు హ్యూమనాయిడ్ రోబో లను కూడా విడుదల చేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది.