ప్రపంచంలో రోజురోజుకి టెక్నాలజీని మనిషి వినియోగం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకరోజు ఉన్న టెక్నాలజీ మరొకరోజు కనబడటంలేదు.
కొత్త టెక్నాలజీతో ముందు టెక్నాలజీని మరిచిపోయేలా చేస్తుంది.ఇకపోతే మనుషుల పనులు కూడా ఈ కాలంలో రోబోలు ఇట్లే చేసేస్తున్నాయి.
ఇందుకు తార్కాణంగా తాజాగా డోర్ డెలివరీ ఎవరు చేస్తారు చెప్పండి మామూలుగా అయితే ఎవరైనా మనిషి వచ్చి మీకు సంబంధించిన వస్తువులను డెలివరీ తీసుకువస్తాడు.
అయితే ఇక ఆ కాలానికి త్వరలో చెల్లు కాబోతున్నట్లు కనబడుతోంది.
దీనికి కారణం డెలివరీ బాయ్స్ బదులు ఇప్పుడు రోబోలు వాటి స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.తాజాగా సింగపూర్ దేశానికి చెందిన ఓ కంపెనీ ఇలాంటి రోబోలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం ట్రైల్స్ లో ఉన్న ఈ ప్రక్రియ తో రోబోలు ఆ దేశంలో బిజీబిజీగా గడిపేస్తున్నాయి.
ఇకపోతే ఆ కంపెనీ రోబోలకు పేరు కూడా పెట్టింది.
కామెల్లో అని ఎవరైనా పిలవగానే ఈ రోబోలు ఎస్ బాస్ అంటూ రెడీ అయిపోతున్నాయి.మొత్తం 20 కేజీల సరుకు పెట్టుకునేందుకు ఆ రోబో లో స్థలం ఉంటుంది.
మీరు ఏవైనా ఆర్డర్ చేస్తే అందుకు సంబంధించిన వస్తువులను ఆ రోబో నింపుకొని మీరు ఎక్కడికి అయితే డెలివరీ చెప్పారో అక్కడ వాలిపోతాయి.ఆ తర్వాత సరుకులు తీసుకున్నాక రోబోలు అవి వాటిని శుభ్రపరుచుకుంటాయి.
ఇక అల్ట్రావైలెట్ లైట్ విధానం ద్వారా ఏవైనా వైరస్ లాంటివి ఉంటే వాటిని పూర్తిగా నాశనం చేయగలుగుతాయి.ప్రస్తుతం ఈ రోబోట్లు రోజుకు నాలుగు నుంచి ఆరు డోర్ డెలివరీలు చేయగలుగుతున్నాయి.
ఈ కంపెనీ నుండి ప్రస్తుతం ఏడు వందల రోబోలు నిర్విరామంగా పని చేస్తున్నాయి.