డైరెక్టర్ ఇంట్లో దొంగలు బడ్డారు

దర్శకుడు పూరి జగన్నాధ్‌ ఇంట్లో దొంగలు పడ్డారు.ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో దొంగలు పడి దాదాపు 15 లక్షల విలువైన ఆభరణాలను దోచుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

 Robbery In Director Puri Jagannadh’s House-TeluguStop.com

గురువారం రాత్రి సమయంలో ఈ దొంగతనం జరిగినట్లుగా తెలుస్తోంది.కాస్త ఆలస్యంగా మీడియాకు ఈ విషయం తెల్సింది.

శుక్రవారం మద్యాహ్నం సమయంలో పూరి కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఆ సమయంలో ఈ విషయం మీడియాకు చేరింది.

పూరి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు.పూరి కుటుంబ సభ్యులతో పాటు, ఆ ఇంట్లో పని చేసే పని వారు, ఆ ఇంటికి వచ్చిన అతిధులను కూడా పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ దొంగతనంకు పాల్పడ్డ వారు ఆ ఇంట్లో వారికి తెలిసిన వారు అయ్యి ఉండవచ్చు అనే ప్రాధమిక అంచనాకు పోలీసులు వచ్చినట్లుగా తెలుస్తోంది.ఆ దిశగానే ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube