దర్శకుడు పూరి జగన్నాధ్ ఇంట్లో దొంగలు పడ్డారు.ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో దొంగలు పడి దాదాపు 15 లక్షల విలువైన ఆభరణాలను దోచుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
గురువారం రాత్రి సమయంలో ఈ దొంగతనం జరిగినట్లుగా తెలుస్తోంది.కాస్త ఆలస్యంగా మీడియాకు ఈ విషయం తెల్సింది.
శుక్రవారం మద్యాహ్నం సమయంలో పూరి కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఆ సమయంలో ఈ విషయం మీడియాకు చేరింది.
పూరి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు.పూరి కుటుంబ సభ్యులతో పాటు, ఆ ఇంట్లో పని చేసే పని వారు, ఆ ఇంటికి వచ్చిన అతిధులను కూడా పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ దొంగతనంకు పాల్పడ్డ వారు ఆ ఇంట్లో వారికి తెలిసిన వారు అయ్యి ఉండవచ్చు అనే ప్రాధమిక అంచనాకు పోలీసులు వచ్చినట్లుగా తెలుస్తోంది.ఆ దిశగానే ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.