భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి సింగపూర్ కోర్టు 11 ఏళ్ళ 5 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.ఈ మేరకు అతడిని క్షమించ కూడదంటూ న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివరాలలోకి వెళ్తే.విశ్వనాధన్ వడివేలు అనే వ్యక్తి జులై 2017 న సింగపూర్ లోని ఓ షెల్ పెట్రోల్ స్టేషన్ లోకి వెళ్లి తుపాకి తో సిబ్బందిని బెదిరించి దొంగతనం చేశాడు.
ఆ సమయంలో సిబ్బంది ఎంతో చాకచక్యంగా ప్రవర్తించి అతడిని పట్టుకుని పోలీసులకి అప్పగించారు.
పోలీసులు అదుపులోకి తీసుకుని అతడిని పరిశీలించగా అతడి జేబులో ఓ కొకైన్ కవర్ కూడా దొరికింది.దాంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా అతడు కొకైన్ వాడుతున్నట్లుగా కూడా నిర్ధారణ అయ్యింది.దాంతో అతడిపై దొంగతనం కేసు, అక్రమఆయుధాల కేసు , మాదక ద్రవ్యాల కేసు మొత్తం మూడు కేసులు పెట్టారు.
అప్పటి నుంచీ విచారణ చేస్తూ వచ్చిన కోర్టు ఎట్టకేలకి అతడి నేరాలపై నిన్నటి రోజున తుది తీర్పుని ఇచ్చింది.అతడు చేసిన తప్పులు క్షమించ లేనివి కాబట్టి అతడికి 11 ఏళ్ళ 5 నెలల జైలు శిక్ష విధిస్తున్నాను అంటూ తీర్పు చెప్పారు.
అయితే గతంలో తీర్పు చెప్పే సందర్భంలోనే అతడు మానసిక పరిస్థితి బాగోనట్టుగా నటించడంతో తీర్పు వాయిదా వేసి చివరికి అతడే తప్పు చేశానని ఒప్పుకోవడంతో తుది తీర్పు తెలిపారు.