ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఆనందంగా అమ్ముకున్నాడు.డబ్బలు తన అకౌంట్ లో పడ్డాయని తెలిసి ఇంటి నుంచి బయలు దేరాడు.
బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని ఇంచికి వచ్చాడు.కానీ వచ్చి చూసే సరికి డబ్బులు కనిపించలేదు.
ఏం జరిగిందా అని ఆలోచించిన అతనికి.మార్గ మధ్యంలో ఓ షాపు వద్ద బండిని బయటే నిలిపి లోపలికి వెళ్లినట్లు గుర్తొచ్చింది.
అక్కడే పోయి ఉంటాయని గుర్తి వచ్చి ద్విచక్ర వాహనంపైనే ఆ బ్యాగును మరిచిపోయి వెళ్లాడు.అయితే వచ్చి చూసే సరికి ఆ బ్యాగులో ఉన్న డబ్బును దోచుకెళ్లారు.
మహబూబాబాద్ జిల్లా ఓ రైతు ద్విచక్ర వాహనం బ్యాగులో పెట్టిన డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసారు.మల్యాల శివారు రామోజీ తండాకు చెందిన బానోతు శీను మిర్చి అమ్మిన నగదును గమ్ముడూరు ఎస్బీఐ బ్యాంకు నుంచి తీసుకొని వెళ్తున్నాడు.
మార్గం మధ్యలో పని నిమిత్తం ఓ దుకాణంలోకి వెళ్లగా.ఇద్దరు ఆగతంకులు వాహనంలోని 4 లక్షల రూపాయాలు కాజేశారు.డబ్బులు కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులను ఎవరో కాజేశారంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు.
ఏడాది పాటు కష్టపడితే వచ్చిన డబ్బులు అవి అని వాపోయాడు.నగదు దోచుకెళ్లిన సంఘటనా దృశ్యాలు.
సీసీ కెమెరాకు చిక్కాయి.ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.