పేషెంట్ ని కూడా వదలటం లేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగలు తమ రూటు మార్చారు.ఇళ్ళు,బ్యాంకులు, ఏటీఎంలే కాదు.

 Robbers Not Leaving Patients Too-TeluguStop.com

ఆసుపత్రులను సైతం తమ టార్గెట్‌ లిస్టులో చేర్చేశారు.ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన దోపిడీ ఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.

ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం విజయకుమార్‌ దంపతులు తమ కుమార్తెతో కలసి వచ్చారు.వంటి మీద ఉన్న ఆభరణాలను ఓ బ్యాగ్‌లో ఉంచారు.

నర్సు వచ్చి ఇంజక్షన్‌ చేసి వెళ్ళిన తరువాత… తలుపు దగ్గరుకు వేసి పడుకున్నారు.

మరోసారి నర్సు రావాల్సి ఉన్నందున తలుపు గడియ పెట్టలేదు.

అయితే.అంతలోనే ఓ దొంగ వచ్చి.

బ్యాగ్‌లోని 10 కాసుల బంగారం, 15వేల నగదును ఎత్తుకు పోయాడు.నిద్రనుంచి మేలుకున్న విజయకుమార్‌ దంపతులు అరవటంతో… బయట తలుపు గడియపెట్టి పరారయ్యాడు.అయితే… ఈ విజువల్స్‌ అన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ఈ దోపిడీ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

సిసి కెమెరాలో దొంగ విజువల్స్‌ రికార్డు అవ్వటంతో… పోలీసులు వేట మొదలు పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube