పశ్చిమలో టీడీపీ ఓడిపోయే మొదటి స్థానం ఇదేనా...???

ఏపీలో ఎన్నడూ లేనంతగా ఎంతో ఉత్ఖంట భరితంగా వచ్చే ఎన్నికలు జరుగనున్నాయి.ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో తల మునకలయ్యి ప్రత్యర్ధులపై విమర్సన బాణాలు సందిస్తున్నాయి.

 Road Show Of Tdp Mla Candidate For Chintalapudi Constituency-TeluguStop.com

తాము సరైన అభ్యర్ధులనే నిలబెట్టాము అని అధినేతలు అనుకున్నా ప్రజా క్షేత్రంలో కొంత మంది నేతలకి మద్దతు లేకపోవడం చూసి అధినేతలు ఖంగుతింటున్నారట.ఇప్పటికే టీడీపీ అధినేతకి తగలాల్సిన షాకులు వరుస పెట్టి తగులుతూనే ఉన్నాయి.

ఇప్పుడు అధినేత వారి ఎంపిక విషయంలో తప్పు ఎలా జరిగిందని ఆలోచిస్తున్నారట.

అంతేకాదు టీడీపీ కి గత ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన ఏకైక జిల్లాగా పశ్చిమ గోదావరి ఉంటే ఇప్పుడు ఇదే జిల్లా చంద్రబాబు కుర్చీ కింద సెగలు పుట్టిస్తోందట.ఏపీలోనే మొట్టమొదటి ఓటమి వినే స్థానం కూడా పశ్చిమ గోదావరి నుంచే వస్తుందని, ఆ స్థానంలో టీడీపీ కోలుకోలేని విధంగా మట్టి కరవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.అసలు చంద్రబాబు ఇంత రాంగ్ స్టెప్ ఎలా వేశారో అర్థం కావడం లేదని అంటున్నారు పరిశీలకులు.

ఇంతకీ టీడీపీ మొదటి ఓటమి అందుకునే స్థానం పశ్చిమలో ఎక్కడ ఉందంటే.

ఏపీలో వైసీపీని టీడీపీ డీ కొట్టే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని ఇప్పటికే టీడీపీ శ్రేణులకి అర్థమయ్యిందని, అందుకు నిదర్సనంగా వైసీపీ సభలకి, టీడీపీ సభలకి వచ్చే జనాలని బేరీజు వేసుకుంటే చాలని అంటున్నారు.

తమ సభలకి కూడా కుప్పలు తెప్పలుగా జనం వస్తున్నారు, మా గెలుపు ఖాయం అని పై పై కి చెప్పుకుంటుంటే సోషల్ మీడియాలో సదరు నేతల ప్రచారంలో ఒక్క మనిషి కూడా లేని వీడియోలు ఫుల్ పాపులర్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధిగా నిలబడిన అవుట్ డేటెడ్ పొలిటీషియన్ కర్రా రాజారావుకి ప్రజా మద్దతు ఏ రేంజ్ లో ఉందో దానికి సంభదించిన ఓ వీడియో ఏపీలో హల్చల్ చేస్తోంది.టీడీపీ కి ప్రజలు ఏపీలో ఎలా బ్రహ్మరధం పడుతున్నారో ఈ ఒక్క వీడియో చూస్తే చాలని అంటున్నారు.

కంచుకోటలో ఇలాంటి దృశ్యాలు టీడీపీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయని అంటున్నారు.

ఎంతో హడావిడిగా ప్రచారానికి వెళ్ళిన చింతలపూడి టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావు కి వింత అనుభవం ఎదురయ్యింది.

జంగారెడ్డిగూడెం మండలం ఏ.పోలవరంలో కర్రా రాజారావు రోడ్ షో చేపట్టగా ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం కర్రా కి షాక్ ఇచ్చింది.అంతేకాదు ఆయనవెంట ఒకరు ఇద్దరు నేతలే ఉండటం టీడీపీ పరిస్థితి చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.

రోడ్ పై ఒక్కరు లేకపోయినా కూడా కర్రా రాజారావు మాత్రం తన పసంగాన్ని మానలేదు, జనం కనీసం ఇళ్ళనుంచీ బయటకి కూడా రాలేదు, దాంతో సొంత పార్టీ నేతలే ఈ పరిస్థితికి షాక్ అయ్యారట.ఆ ఒక్క ప్రాంతంలోనే కాదు కర్రా ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఎదురవ్వడంతో, పశ్చిమలో టీడీపీ ఓటమి చెందే మొట్టమొదటి స్థానం చింతలపూడి అనడంలో సందేహం లేదని అంటున్నారు విశ్లేషకులు.

ఇదిలాఉంటే వైసీపీ నుంచీ పోటీ చేస్తున్న ఎలిజా కి ప్రజాభిమానం వెల్లువలా రావడం, ప్రజలతో మమేకం అయ్యే తీరు అదేసమయంలో జగన్ సీఎం అవ్వాలనే ప్రజా తీర్పు , ఎలిజాకి తిరుగులేని విజయాన్ని అందించడంతో పాటు భారీ మెజారిటీ లావడం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube