మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్ తాండూర్ సర్కిల్ కన్నెపల్లి పరిధిలోని మెట్పల్లి, ముత్తాపూర్ మార్గ మధ్యలో ఈ నెల 20వ తారీఖున మద్యం మత్తులో లారీ నడిపి మోటార్ బైక్ ని ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికి అక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.
అయితే ఈ ప్రమాదానికి కారణం అయిన లారీడ్రైవర్ ప్రమాదం చేసిన రాత్రి పారిపోతు మద్యం మత్తులో ఎటు వెళ్లాలో తెలియక ఆ పక్కన ఉన్న చేనులో ఆ రాత్రంత దాక్కొని ఇక ఎటైన వెళ్లిపోదామని అనుకుంటూ తన జేబులో డబ్బుల కోసం వెతగ్గా అవి లారీలో మరచిపోయిన విషయం గుర్తుకు వచ్చి భయం భయంగా తిరిగి లారీ వద్దకు వెళ్ళాడట.
అయితే అక్కడే ఉన్న పోలీసులకు ఇతను అనుమానంగా కనిపించడంతో లారీ డ్రైవర్ ని పట్టుకోని తమ స్టైల్లో విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడట.ఇక ఆ లారీలో వెతికిన పోలీసులకు ఇతను సగం తాగి వదిలిన మద్యం బాటిల్ దొరకడంతో దాన్ని సీజ్ చేసి, ప్రమాదానికి కారణం అయిన లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కు పంపడం జరిగిందని సీఐ బాబురావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.