ప్రమాదం ఏ క్షణాన ఎలా ముంచుకొస్తుందో తెలీదు.ప్రమాదాల బారిన పడి రోజుకు పదుల సంఖ్యలో జనాలు మృత్యువాత పడుతున్నారు.తాజాగా విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.11 నెలల పసికందుకు కంటి సమస్య ఏర్పడటంతో ఆస్పత్రికని బైక్ పై వెళ్లిన ఆ జంటను అదుపు తప్పి వచ్చిన ఒక లారీ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు మృతి చెందగా అతని భార్య స్వాతి తలకు గాయమై కోమాలోకి వెళ్లింది.
పూర్తి వివరాలలోకి వెళితే విశాఖ జిల్లా జియ్యమ్మవలస మండలానికి చెందిన శ్రీనివాసరావు తొమ్మిదినెలల క్రితం అక్కివరంలోని శ్రీనివాస హేచరీలో సూపర్ వైజర్ గా చేరాడు.
నిన్న ఉదయం 11 గంటల సమయంలో బాలుడి కంటికి తీవ్రమైన గాయం కావడంతో విశాఖలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి శ్రీనివాసరావు, అతని భార్య, బాలుడు తన్వీర్ బైక్ పై వెళుతుండగా సవరపల్లి పంచాయతీ దగ్గర లారీ బైక్ ను బలంగా ఢీ కొట్టింది.
తలకు బలమైన గాయాలు కావడంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదంలో స్వాతి తలకు తీవ్ర గాయాలు కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను, గాయాలపాలైన తన్వీర్ ఆస్పత్రిలో చేర్పించారు.స్వాతి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆమె కోమాలోకి వెళ్లింది.
విజయనగరం జిల్లా ఆస్పత్రికి శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు పోలీసులు తరలించారు.ఎస్సై శ్యామల ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.