తీవ్ర విషాదం మిగిల్చిన శ్రీశైలం యాత్ర .. !

ఒక్కోసారి ఆనందకరంగా సాగుతున్న జీవితంలోకి అనుకోకుండా మృత్యువు ప్రవేశిస్తాడు.వారి ఆనందం ఆవిరయ్యేలా చేస్తాడు.

 Road Accident Nea Rbuchiredd Ipalem In Nellore District  Srisailam Yatra, Nellor-TeluguStop.com

జీవితాలను చిన్నా భిన్నంగా మారుస్తాడు.బహుశ విధి లీల అంటే ఇదే కావచ్చూ.

ఇకపోతే సంతోషంగా శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు తిరుగు ప్రయాణం అయిన వారికి ఊహించని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఆ వివరాలు తెలుసుకుంటే.నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారు జామున ఆగి ఉన్న లారీని టెంపో ఢీ కొనడం తో, ఈ ప్రమాదం లో టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కాగా హాస్పిటల్ కి తరలిస్తుండగా మరోవ్యక్తి మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు.

అయితే ఈ టెంపోలో మొత్తం 15మంది ఉన్నట్లుగా సమాచారం.మిగిలిన వారికి తీవ్రమైన గాయాలవగా, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారట.

ఇక వీరంతా తమిళనాడుకు చెందినవారుగా భావిస్తున్నారట పోలీసులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube