అనంతపురం జిల్లాలో గుత్తి నేషనల్ హైవేపై అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది.గుత్తి జాతీయ రహదారిలో ఆగి ఉన్న లారిని అంబులెన్స్ బలంగా గుద్దడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే సమీపంలో స్థానికులు సహాయక చర్యలు చేసి క్షతగాత్రులని హాస్పిటల్ కి తరలించారు.
ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో అంబులెన్స్ లో వెళ్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తుంది.
ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని హాస్పిటల్ కి తరలించారు.పోలీసులు సంఘటన స్థలంకి చేరుకొని కేసు నమోదు చేసారు.
చనిపోయిన వారు ఎక్కడి నుంచి వస్తున్నారు.ఎక్కడికి వెళ్తున్నారు వంటి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.