ఘోర రోడ్డు ప్రమాదం, 36 మంది మృతి

డ్రాగన్ దేశం అయిన చైనా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.చైనా జియాంగ్సు ప్రావిన్స్ లో ఒక బస్సు,ట్రక్కు ఢీ కొనడం తో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

 Road Accident In China-TeluguStop.com

ఈ ఘటనలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 36 మంది మృతి చెందినట్లు సమాచారం.అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరో 40 మంది గాయపడినట్లు తెలుస్తుంది.

అయితే గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం బస్సు టైరు పేలడమే అన్నట్లు సమాచారం.

Telugu Bus Truck Crash, China Road, Tyrecollided-

 

రన్నింగ్ లో ఉన్న బస్సు ఎడమ టైరు పేలడం తో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కు ను ఢీకొనడం తో ఇంత ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం 69 మంది తో వెళుతున్న బస్సు తూర్పు జింగ్స్ ప్రావిన్స్ లోని ఎక్స్ ప్రెస్ వేలో వెళుతుండగా ఒక్కసారిగా బస్సు ఎడమ టైరు పేలింది.దీనితో బస్సు అదుపుతప్పి ట్రక్కు ను గుద్దుకొని బోల్తా పడడం తో 36 మంది ప్రాణాలు కోల్పోగా,మరో 40 మంది గాయపడినట్లు తెలుస్తుంది.ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube