అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.గార్లదిన్నె సమీపంలో జాతీయ రహదారిపై డివైడర్ను కారు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తల్లీ, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు హైదరాబాద్కు చెందిన రఘువరన్ రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించారు.
లేపాక్షికి వెళ్తుండగా గార్లదిన్నె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.అతివేగంతో వస్తున్న కారు డివైడర్ను ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న జయంతి, కీర్తనలు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.