అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. టెక్సాస్ లోని వాలర్ కౌంటీ వద్ద కారును ఓ వ్యాను ఢీకొట్టింది.
ఈ ఘటనలో తానా బోర్డు సభ్యుడు డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య వాణిశ్రీ, ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు.
కాలేజీ నుంచి తమ కుమార్తెలను తీసుకుని ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది.కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్.2017 నుంచి తానా బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్నారు.