విజయవాడ: విజయవాడ ప్రకాశం బ్యారేజీ పై రోడ్డు ప్రమాదం జరిగింది.మంగళ గిరి నుంచి స్కూటీ మీద విజయవాడ వస్తున్న తండ్రి కొడుకులను రాంగ్ రూటులో వచ్చిన కారు బలంగా ఢీ కొట్టడంతో స్కూటీ మీద ఉన్న తండ్రి ఎగిరి కృష్ణానదిలో పడి మృతి చెందాడు.
స్కూటీ మీద ఉన్న కొడుకుకి తీవ్ర గాయాలు అయ్యాయి.
విజయవాడ పంజా సెంటర్ కు చెందిన షేక్ అబ్దుల్ ఖదీర్ అతని కొడుకు షేక్ ఫిరోజ్ లు పనిమీద మంగళగిరి వెళ్ళి రాత్రి 10 గంటల సమయంలో తిరిగి వస్తూండగా ఈ ప్రమాదం జరిగింది.
గాయాలు అయిన ఫిరోజ్ నీ అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు.