గత ఏడాది ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో నష్టాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.ఇక కరోనా సమయంలో వచ్చిన కష్టాలను, నష్టాలను తొలగించడానికి చేపట్టే పని ప్రభుత్వం దే ఉంటుంది.
ఇక నష్టం జరిగిన వసూళ్లను తిరిగి సంపాదించడానికి ప్రభుత్వం ప్రతి ఒక్క రేట్లను పెంచుకుంటూ పోతుంది.
ఇప్పటికే సినిమా థియేటర్లు, రవాణా చార్జీలు, నిత్యావసర వస్తువుల రేట్లను పెంచగా.
ఇక పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి.పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి 11 రోజులు కాగా.
సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే నిత్యావసర వస్తువుల పై ధరలు పెంచుకుంటూ పోతే ఇక ప్రజలు ఎవరి తోని నిరసనలు చేస్తారు? దీనిని ఉద్దేశించి ఓ ప్రజా ప్రతినిధి ప్రజలకు మద్దతుగా సైకిల్ పై ప్రయాణిస్తూ నిరసనలు చేస్తున్నాడు.
బీహార్ లోని మహువా నియోజకవర్గ ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్.తనదైన రీతిలో ప్రభుత్వాన్ని నిలదీయాలనుకున్నాడు.బీహార్ లో బడ్జెట్ సెషన్ ప్రారంభం అవ్వడంతో అసెంబ్లీలో మొదటిరోజు సభ ఏర్పాటు చేయగా ఇందులో ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ హాజీపూర్ లో ఉదయం 7 గంటల నుంచి రాజధాని పట్నా లో ఉన్న అసెంబ్లీ వరకు దాదాపు 5 గంటల పాటు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు.
ఈ విధంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.
ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగినందున మరే ఇతర వస్తువులు కొనేలా లేదని తెలిపాడు.మామూలు వస్తువులే ఎక్కువ ధరల స్థాయి వరకు చేరుకున్నాయని, ఇలా అయితే సామాన్యుడి పరిస్థితి రోజు గడవడమే కష్టంగా మారుతోందని తెలిపాడు.
ఇక వీటినన్నింటిని గురించి ప్రభుత్వం పై నిలదీస్తామని తెలిపాడు.