బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లో మాట్లాడే ప్రతి మాట కు చేసే ప్రతి పనికి బయటనుంచి నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తూ ఉంటారు.పొరపాటున కూడా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు అబద్ధాలు చెబితే నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వాటిని తేటతెల్లం చేస్తారు.
ఈ విధంగా హౌస్ లోకి వెళ్ళిన 19 మంది కంటెస్టెంట్ లలో కాజల్ మొదటి నుంచి కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుందని నెటిజన్లతో పాటు హౌస్ సభ్యులు కూడా భావిస్తున్నారు.ఈ క్రమంలోనే గత ఎపిసోడ్ లో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
కెప్టెన్ సిరి హౌస్ సభ్యులందరికీ వివిధ పనులను అప్ప చెబుతూ ఎంతో బాధ్యతగా ప్రవర్తిస్తున్న సమయంలో కాజల్ మాత్రం తనకు కుకింగ్ డిపార్ట్మెంట్ తప్ప ఏ పని ఇచ్చినా చేస్తానని తనకు వంట చేయడం రాదు అంటూ అబద్ధాలు చెప్పింది.కాజల్ ఈ విధంగా చెబుతున్న సమయంలో సింగర్ శ్రీరామచంద్ర జోక్యం చేసుకొని నాకు చిన్నప్పటి నుంచి ఏ పనులు చేయడం అలవాటు లేదు అయినప్పటికీ ఇక్కడ అన్ని పనులు చేస్తున్న ఎవరైనా చేయాల్సిందే అంటూ తెలిపారు.
హౌస్ లో తనకు వంట చేయడం రాదు అంటూ అబద్ధాలు చెప్పిన కాజల్ వ్యవహారాన్ని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు.గతంలో తను తన భర్త కోసం చేపల కూర వండుతూ ఉన్నటువంటి వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నెటిజన్లు కాజల్ పై మండిపడుతున్నారు.వంట చేయడానికి వచ్చినప్పటికీ ఇలా చేయడం రాదు అని అబద్ధాలు చెబుతూ అడ్డంగా బుక్ కావడంతో నెటిజన్లు ఈమె పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు కేవలం తన అతి చూస్తూ విసిగిపోయిన నెటిజన్లకు అబద్ధాలు కూడా చెబుతుండడంతో ఫస్ట్ ఈమెను హౌస్ నుండి ఎలిమినేట్ చేయాలంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.