బాలీవుడ్ ఇండస్ట్రీ లో మూడు పదుల వయస్సు కలిగి స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ మంచి క్రేజ్ ఉన్న టైంలో సుశాంత్ సింగ్ మరణించటం అందరికీ షాక్ ఇచ్చినట్లయింది.సరిగ్గా లాక్ డౌన్ సమయంలో జూన్ 14 వ తారీకు ముంబైలో తన ఓన్ ఫ్లాట్ లో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది.
రాజకీయ నాయకులు సెలబ్రిటీలు సుశాంత్ మరణవార్తను జీర్ణించుకోలేక పోయారు.అయితే ఎందువల్ల మరణించాడు అన్న దాని విషయంలో అనేక అనుమానాలు బయట ఉన్న తరుణంలో సుశాంత్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా అతని సోదరీమణులు.
సుశాంత్ మరణానికి కారణం రియా చక్రవర్తి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటం అప్పట్లో సెన్సేషనల్ అయింది.
ఈ క్రమంలో విచారణ స్టార్ట్ చేసిన పోలీసులు.
కేసు తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో కేంద్రం ఈ కేసును సిబిఐ కి అప్పగించడంతో డ్రగ్స్ కోణం బయటపడటంతో నార్కోటెక్ అధికారులు కూడా రంగంలోకి దిగడంతో డ్రగ్స్ విషయంలో సరికొత్త పేర్లు బయటపడ్డాయి.ఈ క్రమంలో రియా చక్రవర్తి ఆమె సోదరుడు అరెస్టు అవటమే కాక జైల్లో ఉండి ఇటీవల బెయిలు పొందటం జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు బయటకొచ్చిన రియా చక్రవర్తి సుశాంత్ కుటుంబ సభ్యుల పై రివెంజ్ తీర్చుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
మేటర్ లోకి వెళ్తే రియా చక్రవర్తి తాజాగా సుశాంత్ సోదరీమణులు ప్రియాంక.మితు పై అదేవిధంగా డాక్టర్ తరుణ్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.వీళ్లంతా సుశాంత్ పర్సనల్ డాక్టర్ ని సంప్రదించకుండా కొత్తకొత్త డ్రగ్స్ ఇవ్వటం జరిగిందని అలా చేయటం నేరమని ఆరోపించింది.అతని ఆరోగ్యం గురించి ఏ విషయం తెలుసుకోకుండా వీళ్లంతా కలిసి కొత్త మెడిసిన్ ఇవ్వటంతో సుశాంత్ మరణించాడని ఈ క్రమంలో తన పై కుమ్మక్కయ్యారు.
హత్య.మోసం.
ఫోర్జరీ.మెడికల్ ప్రిస్క్రిప్షన్ .క్రిమినల్ కుట్ర వంటి కల్పిత ఆరోపణలతో కేసులు పెట్టి వేధించడం జరిగిందని ప్రత్యారోపణలు చేసింది.దీంతో మొత్తంమీద చూసుకుంటే రియా చక్రవర్తి బెయిలు వచ్చాక వ్యవహరిస్తున్న తీరు చూస్తే సుశాంత్ కుటుంబసభ్యులపై రివెంజ్ తీర్చుకోవడానికి రెడీ అయినట్లు అర్థం అవుతోంది.