పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీతూ వర్మ, తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపును సాధించింది.ఈ బ్యూటీ చాలా తక్కువ సినిమాలు చేసి అంతే తక్కువ సమయంలో తెలుగులో కనిపించకుండా పోయింది.
అయితే తానేమీ సినిమాల నుండి తప్పుకోలేదని, తాను సినిమాలు చేస్తున్నానంటూ ఇటీవల ‘‘కనులు కనులను దోచాయంటే’’ అనే సినిమాతో మనముందుకు వచ్చింది.
తెలుగు-తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సాల్మన్ హీరోగా నటించగా రీతూ వర్మ హీరోయిన్గా నటించింది.
రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సడెన్ హిట్గా నిలిచింది.దీంతో మరోసారి రీతూ వర్మ లైమ్లైట్లోకి వచ్చింది.
ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో మరోసారి ఇలాంటి మూవీకే ఆమె ఓకే చెప్పిందట.తమిళ-తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అశోక్ సెల్వన్, నిత్యా మీనన్ లీడ్ రోల్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను అని శశి డైరెక్ట్ చేయనున్నారు.మొత్తానికి ఓ బైలింగువల్ మూవీతో మళ్లీ లైమ్లైట్లోకి వచ్చిన రీతూ వర్మ మరోసారి అలాంటి మూవీనే ఎంచుకోవడంతో అందరి చూపు ఆమెవైపు తిరిగింది.
ఇక తెలుగులో నాని హీరోగా తెరకెక్కుతున్న టక్ జగదీష్ సినిమాలో హీరోయిన్గా రీతూ వర్మ నటిస్తోంది.