తెలుగు సినిమాలలో తెలుగు అమ్మాయిలకి హీరోయిన్స్ గా ఎక్కువ అవకాశాలు లభించవు అనేది చాలా మంది అభిప్రాయం.అయితే తెలుగమ్మాయిలు తాము తెరకెక్కించే సినిమాలలో పాత్రలకి సరిపోయే లుక్స్ లో ఉండరని, అలాగే గ్లామర్ పాత్రలు చేయడానికి ఇబ్బంది పెడుతూ ఉంటారని, తాము ఇలాంటి పాత్రలే చేస్తామని కొత్తవాళ్లు కూడా మడికట్టుకొని కూర్చుంటారని అందుకే తమ సినిమాలలో తెలుగు అమ్మాయిలకి హీరోయిన్స్ గా అవకాశాలు ఇవ్వలేమని దర్శకులు చెప్పే కంప్లైంట్.
అయితే ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్న తెలుగు అమ్మాయిలుగా టాలీవుడ్ లో అడుగుపెట్టే వారిలో కొద్ది మంది మాత్రమే తమని తాము ప్రూవ్ చేసుకొని అవకాశాలు పెంచుకుంటూ వెళ్తారు.ఓపికగా ప్రయత్నం చేసి, ఇతర బాషలలో తమని తాము ప్రూవ్ చేసుకొని తరువాత తెలుగులో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న హీరోయిన్స్ లో అంజలి తర్వాత ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ తెలుగు అమ్మాయిలు ఉన్నారు.
ఇప్పటికే అంజలి తనని తాను ప్రూవ్ చేసుకొని స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది.
కోలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.తెలుగులో ఆలస్యంగా ఆమెకి గుర్తింపు వచ్చిన రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్స్ తో నటించే అవకాశం సొంతం చేసుకుంది.
ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో పెద్దగా గుర్తింపు లేకపోయిన కోలీవుడ్ లో మాత్రం 25 సినిమాలు పూర్తి చేసేసింది.ఇక బాద్ షా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోయిన్ అయినా రీతూ వర్మకి పెళ్లి చూపులు సినిమాతో బ్రేక్ వచ్చింది.
తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినా తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ వస్తుంది.అయితే చాలా గ్యాప్ తరువాత మరల వరుస తెలుగు సినిమాలతో పలకరించడానికి రెడీ అవుతుంది.
ప్రస్తుతం తెలుగులో నానికి జోడీగా టక్ జగదీశ్ సినిమాలో రీతూ వర్మ నటిస్తుంది.దీంతో పాటు శర్వానంద్ తో తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రం చేస్తుంది.
ఇప్పుడు రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా ఖరారు అయినట్లు టాక్ వినిపిస్తుంది.ఈ మూడు సినిమాలు రిలీజ్ అయితే ఇక టాలీవుడ్ లో అమ్మడు ఫేట్ మారిపోయే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.