పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రీతూ వర్మ, ఆ తరువాత చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు చేసింది.కేశవ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసినా అది వర్కవుట్ కాలేదు.
ఇక తమిళంలో స్టార్ హీరో విక్రమ్తో కలిసి ‘ధృవనచ్చత్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి నానా తంటాలు పడుతోంది.ఈ సినిమా పూర్తయ్యి చాలా రోజులు గడిచినా రిలీజ్కు మాత్రం నోచుకోలేదు.
కాగా తెలుగులో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో హీరోయిన్గా అమ్మడు మళ్లీ కమ్బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది.అయితే అమ్మడిని బ్యాడ్లక్ మాత్రం వీడటం లేదు.యంగ్ హీరో శర్వానంద్, మరో హీరో నాగశౌర్యల చిత్రాల్లో రీతూ వర్మ నటించనుంది.అయితే నాగశౌర్య నటించబోయే సినిమా ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల అటకెక్కినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాపై మంచి ఆశలు పెట్టుకున్న రీతూ వర్మ నిరాశకు లోనయ్యింది.
ఇక శర్వానంద్తో కలిసి చేయబోయే సినిమాతోనైనా ఈ తెలుగు బ్యూటీ మంచి కమ్బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.
కాగా నాని నటిస్తున్న టక్ జగదీష్ చిత్రంలో హీరోయిన్గా ఈ బ్యూటీ నటిస్తోన్న సంగతి తెలిసిందే.