బుల్లితెరపై మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న షోలలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా ఒకటి.తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో రష్మీ కళ్లు తిరిగి పడిపోయినట్టు నటించి టీఆర్పీ స్టంట్ చేశానని చెబుతుంది.
ఆ తర్వాత పూర్ణ, ఇమ్మాన్యుయేల్ కలిసి టీఆర్పీ స్టంట్ చేశారు.ఆ తర్వాత నూకరాజు రీతూ చౌదరి ఎవరిని ప్రేమిస్తోందని అడగగా రీతూ చౌదరి తాను హైపర్ ఆదిని లవ్ చేస్తున్నానని చెబుతుంది.
సీరియస్ గా తనకు ఆది అంటే ఇష్టమని ఆ విషయం ఆదికి కూడా తెలుసని రీతూ చౌదరి చెప్పుకొచ్చారు.రీతూ చౌదరి ఆదిని లవ్ చేస్తున్నానని చెప్పడంతో రష్మీ షాకవుతారు.
రామ్ ప్రసాద్ ఇన్నిరోజులు షూట్ చేశావు నాతోనే చెప్పలేదు అని అడగగా హైపర్ ఆది నాతో కూడా తను చెప్పలేదని చెప్పి షాకిచ్చాడు.ఆ తర్వాత రీతూ చౌదరి ఆదితో నేను మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నానని హైపర్ ఆదితో కొంత టైమ్ అయినా స్పెండ్ చేయడం తనకు ఇష్టమని ఆమె తెలిపారు.
రీతూ చౌదరి ఆదికి ఐ లవ్ యూ చెప్పగా పూర్ణ రీతూ చౌదరికి జవాబు చెప్పాలని అడగగా తనకు ఇప్పటివరకు ఈ విషయం తెలియదని ఆది చెప్పుకొచ్చారు.రామ్ ప్రసాద్ ఏదో ఒకటి చెప్పరా టెన్షన్ తట్టుకోలేకపోతున్నానని ఆది కామెంట్లు చేశారు.
రీతూ చౌదరి మీకు ఇష్టమైతే ఓకే లేకపోతే ఇప్పుడే వెళ్లిపోతానని చెప్పగా నాకు నిజంగా అలాంటి ఉద్దేశం లేదని ఆది చెబుతాడు.
రీతూ చౌదరి స్టేజ్ మీద నుంచి వెళ్లిపోగా రష్మీ ఆది చెంద పగులగొడతారు.ఒక అమ్మాయి మనస్సును విరగ్గొట్టావు నువ్వు మనిషివా? పశువువా? అంటూ రష్మీ డైలాగ్ చెబుతారు.ఆ తర్వాత ఆది నో చెప్పాడని తాను నూకరాజుకు యస్ చెప్పానని రీతూ చౌదరి పిలిచారు.
అయితే ఇది కూడా టీఆర్పీ స్టంట్ అని తెలిసి అందరూ నవ్వుకున్నారు.